ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కాంబినేషన్ లో లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ఈ సినిమా అఖండ విజయం సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. పుష్ప మూవీ అనేక రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో పుష్ప సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి పుష్ప మూవీ విడుదలకు ముందే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని దర్శకుడు సుకుమార్ చెప్పారు. అనుకున్నట్లే పుష్ప-2 సినిమా పనులు మొదలయ్యాయి. అయితే తొలి పార్ట్ ఇచ్చిన కిక్ తో రెండో పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదంటూ బన్నీ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ ముందు ఆందోళన చేశారు.
పుష్ప మూవీ ఇచ్చిన జోష్ తో సుకుమార్, అల్లు అర్జున్ స్వీకెల్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. మొదటి పార్ట్ కంటే ఈ సినిమాను ఇంకా డిఫరెంట్ గా తీయాలని చిత్ర యూనిట్ ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట ఓ న్యూస్ బయటకు వచ్చింది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బన్నీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. రాగానే పుష్ప-2 సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిచింది. అయితే అర్జున్ అమెరికా నుంచి తిరిగి వచ్చి.. నెల రోజులు దాటినా పుష్ప-2 మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ నిరసనలు చేస్తున్నారు. గతంలో బన్నీ సినిమాలకు ఎప్పుడు లేని విధంగా పుష్ప సీక్వెల్ అప్ డేట్ కోసం ఆందోళనకు దిగారు.
తమ హీరో సినిమా అప్ డేట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలు అభిమానులు గుమిగూడి పుష్ప సీక్వెల్ సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి నవంబరు మొదటి వారంలోనే సినిమా షూటింగ్ మొదలవుతుందని సినిమా యూనిట్ చెప్పినా.. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పలు కారణాలతో సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానులు గరం గరం అవుతున్నారు. వెంటనే సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు నిరసన చేపట్టారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళ లోనూ సినిమా అప్ డేట్ కోసం ఆందోళనకు దిగుతున్నారు.
AP,TG ,Kerala , Karnataka,TN,UAE…..
Offline campaign about #Pushpa2 updates is on full HEAT all over💥💥
” #WeWantPushpa2Update ”AA cults on RAGE…More to Come!!!🙏
Please WakeUP @MythriOfficial @alluarjun #PushpaTheRule @PushpaMovie pic.twitter.com/HueeSaE5Ba
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) November 13, 2022
తాజాగా హైదరాబాద్ లో అభిమానులు ఆందోళనకు దిగడం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఇక్కడ ఈ నిరసనపై ట్రోలింగ్స్ కూడా నడుస్తోన్నాయి. ఎందుకంటే.. వాస్తవానికి పుష్ప-2 మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ ఆఫీస్ ముందుకు కాకుండా, గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన చేయడంపై ట్రోలింగ్ నడుస్తోంది. బన్నీని పాన్ ఇండియా స్టార్ చేసిన పుష్ప మూవీ.. ఇటీవల జరిగిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ఓ రేంజ్లో సత్తా చాటింది. మొత్తం 7 విభాగాల్లో పుష్ప అవార్డులను దక్కించుకున్న విషయం అందరికి తెలిసిందే.