హరాహోరిగా సాగిన టోక్యో ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్లో రెజ్లర్ రవికుమార్ ఓటమిపాలయ్యారు. అనూహ్య రీతిలో సాగిన ఈ పోరులో చివరికి రవికుమార్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టాడు. దీంతో రవికుమార్ పతకంతో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. దీంతో ఎట్టకేలకు స్వర్ణం పతకాన్ని తీసుకొస్తాడని అందరూ ఎదరుచూశారు. కానీ నేడు జరిగిన హారాహోరిగా మ్యాచ్లో మొదట్లో పుంజుకున్నాడు రవికుమార్. కానీ అనూహ్యంగా కాస్త వెనకబడడటంతో రవి కుమార్కు ఓటమి దరి చేరినా వెండి పతకంతో మెరిసాడు.
దీంతో ప్రతీ ఒక్కరు రెజ్లర్ రవికుమార్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత కీర్తి పతకాన్ని ఎల్లదాటించి రజత పతకాన్ని ముద్దాడాడు. అయితే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ స్పందించి రవికుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘రవి కుమార్ దహియా అద్భుతమైన ఆటగాడు. అతను కనబరిచిన స్ఫూర్తి అద్భుతం. రజత పతకం గెలిచుకున్నందుకు రవి కుమార్కు శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్లో తెలిపాడు ప్రధాని.
Ravi Kumar Dahiya is a remarkable wrestler! His fighting spirit and tenacity are outstanding. Congratulations to him for winning the Silver Medal at #Tokyo2020. India takes great pride in his accomplishments.
— Narendra Modi (@narendramodi) August 5, 2021