ఐసీసీ క్రికెట్ షెడ్యూల్ విడుదల చేసినప్పటినుండి దేశంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే అప్పుడే ఎక్స్ పర్ట్స్ ఏ జట్లు సెమిస్ కి చేరాతాయో అంచనా వేస్తున్నారు. ఇక బీసీసీఐ మాజీ అధ్యకక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం వరల్డ్ కప్ భారత్ లో జరుగుతుండడంతో సంతోషంతో ఎమోషనల్ అవుతున్నాడు.
ఐసీసీ క్రికెట్ షెడ్యూల్ విడుదల చేసినప్పటినుండి దేశంలో సందడి వాతావరణం నెలకొంది. టోర్నీకి మరో మూడు నెలల సమయం ఉన్నా ఇప్పుడే హడావుడి మొదలైపోయింది. ఈ టోర్నీ కోసం టీమిండియాతో పాటు అభిమానులు, దిగ్గజాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ నవంబర్ 19 న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. ఇక అందరూ మోస్ట్ క్రేజీయస్ట్ మ్యాచ్ గా భావించే ఇండియా పాకిస్థాన్ పోరు అక్టోబర్ 15 న జరగబోతుంది. ఈ మూడు మ్యాచులకి కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. ఇక ఈ షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే అప్పుడే ఎక్స్ పర్ట్స్ ఏ జట్లు సెమిస్ కి చేరాతాయో అంచనా వేస్తున్నారు. ఇక బీసీసీఐ మాజీ అధ్యకక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం వరల్డ్ కప్ భారత్ లో జరుగుతుండడంతో సంతోషంతో ఎమోషనల్ అవుతున్నాడు.
2011 తర్వాత తొలిసారి భారత్ లో వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు. 2011 నుండి చూసుకుంటే ఏ దేశంలో టోర్నీ జరిగితే ఆ జట్టే టైటిల్ ఎగరేసుకుపోయింది. దీని ప్రకారం ఈ సారి మన టీమిండియాకు వరల్డ్ కప్ నెగ్గడం ఖాయమంటున్నారు. అయితే 2021లోనే టీ 20ప్రపంచ కప్ ఇండియాలో నిర్వహించాలనుకున్నారు. అప్పుడు గంగూలీ అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అయితే అప్పుడు మిస్ అయినా ఇప్పుడు సంతోషంగా ఉంది అంటూ గంగూలీ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. అంతే కాదు ఈ టోర్నీ భారత్ లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.
గంగూలీ ట్వీట్ చేస్తూ.. ” కరోనా కారణంగా నేను ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వరల్డ్ కప్ నిర్వహించడం సాధ్యం కాలేదు. అయితే ఈ వరల్డ్ కప్ ఎంతో గొప్పగా ఉండబోతుందని ఆశిస్తున్నా. అద్భుతమైన వేదికలు, చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని వేదికలు ఉన్నాయని మరే దేశమూ గర్వంగా చెప్పుకోలేదు. అలాగే ప్రపంచం అంతా గుర్తుంచుకునే రేంజ్లో ఈ టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తుందని భావిస్తున్నాను. బీసీసీఐ, జై షా, రోజర్ బిన్నీ.. అందరికీ కంగ్రాట్స్” అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి గంగూలీ ఈ టోర్నీ కోసం బాగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Look forward to the World Cup in india .. missed out as president due to covid ..what a spectacle it will be ..great venues .. great allocations . So many venues no country can boast of ..Bcci will make it a tournament to remember for the world .. congratulations to all at @BCCI…
— Sourav Ganguly (@SGanguly99) June 28, 2023