India vs Australia 3rd T20: హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. అష్టకష్టాలు పడి మ్యాచ్ టికెట్లు దక్కించుకున్న వారికి స్టేడియంలో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. మ్యాచ్కు కేవలం ఘనత సమయమే మిగిలి ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో హెచ్సీఏ ఘోరంగా విఫలమైంది. స్టేడియం లోపల ఎటు చూసినా విరిగిపోయిన ఛైర్లు, దుమ్ము పట్టిన కుర్చీలే కనిపిస్తున్నాయి. ఒకవేళ బాగున్నా, వాటిపై పావురాల రెట్టలు దర్శనమిస్తున్నాయి.
ఉప్పల్ స్టేడియంలో చివరిసారిగా 2019లో మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత, కరోనా కారణంగా మ్యాచ్ లు జరగకపోవడంతో దాన్ని పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఎటు చూసినా విరిగిపోయిన ఛైర్లు, దుమ్ము పట్టిన కుర్చీలే దర్శమిస్తున్నాయి. విరిగిన ఛైర్లకు రిపేర్లు చేయడం మాట అటుంచితే గాలివానలకు దుమ్ముతో నిండిపోయిన కుర్చీలను శుభ్రం చేసే నాధుడే లేకుండా పోయాడు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఈదురుగాలులకు స్టేడియం పై కప్పు కూడా లేచిపోయింది. దాదాపు రూ.10వేలు పెట్టి టికెట్ కొని క్రికెట్ చూసేందుకు వచ్చే వారు సైతం దుమ్ము, ధూళితో కూడిన ఛైర్లలో కూర్చోక తప్పని పరిస్థితి. ఈ విషయాన్ని మీడియా అజారుద్దీన్ దృష్టికి తీసుకురాగా రిపేర్ చేయించేందుకు హెచ్సీఏ దగ్గర పైసల్లేవని చెప్పడం విశేషం. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మ్యాచ్ టికెట్లు ఉన్నవాళ్లు రెండు బకెట్ల నీళ్లు, ఇంత సర్ఫ్ తీసుకెళ్లండి..మీరే కడుక్కుని కూర్చోవాలి…@hycricket_HCA 👎🏻 pic.twitter.com/9Qwf0jGe9G
— HEMA NIDADHANA (@Hema_Journo) September 24, 2022