ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ‘నాడు-నేడు’ పథకం ద్వారా ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యింది. మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాలల రూపు రేఖల్నే మార్చివేసింది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆకర్షితులయ్యేలా ఈ ‘నాడు-నేడు’ పథకం అమలవుతోంది. ఈ పథకంపై ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సీఎం జగన్ పేరు మారు మ్రోగిపోయింది.
అయితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కాపీ కొట్టి ‘పీఎం శ్రీ’ పథకంగా అమలులోకి తెచ్చింది. ఈ పథకాన్ని తాజాగా కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదించింది. దేశవ్యాప్తంగా 14,500 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసి వాటి రూపురేఖలు మార్చాలని, వచ్చే ఐదేళ్ళలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించించి. అయితే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో కేంద్రం తీరును తప్పుబట్టారు. కేవలం 14,500 పాఠశాలలను బాగు చేయాలంటే 5 ఏళ్ళు పడితే.. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలంటే ఎన్నేళ్లు పడుతుందో అంటూ చురకలు అంటించారు. ఇలా బిట్ బిట్లుగా కాకుండా ఒకేసారి 10 లక్షల పాఠశాలలను ఈ పథకం కింద బాగు చేయించాలని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్.
“14,500 పాఠశాలలే కాదు, దేశంలో ఉన్న మొత్తం 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని, మేము ఈ పనికి కేవలం 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను వెంట తీసుకెళ్లండి. మీకు పూర్తి సహకారం అందిస్తామని” ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకాన్ని కాపీ చేస్తే పూర్తిగా కాపీ చేసి.., ఆ పథకం గొప్పతనాన్ని నిలబెట్టాలని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
मैंने प्रधानमंत्री जी को पत्र लिखा है कि सिर्फ़ साढ़े चौदह हज़ार नहीं बल्कि देश के सभी 10 लाख सरकारी स्कूलों को ठीक करना पड़ेगा। हम 5 साल में ये कर सकते हैं। सभी राज्य सरकारों को साथ लेकर चलिए, हम आपको पूरा सहयोग देंगे। pic.twitter.com/AyqD3NDQVg
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 7, 2022