అభివృద్ధి పేరిట ఆయా రాష్ట్రాల్లోని.. ఆయా ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపడుతున్నాయి. ఫ్లై ఓవర్స్, రైల్వే వంతెనలు, రోడ్డు, రహదారులు వేయడం, ప్రాజెక్టుల కట్టడం వంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నాణ్యత లోపం కారణంగా కొన్నికట్టడాలు
అభివృద్ధి పేరిట ఆయా రాష్ట్రాల్లోని.. ఆయా ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపడుతున్నాయి. ఫ్లై ఓవర్స్, రైల్వే వంతెనలు, రోడ్డు, రహదారులు వేయడం, ప్రాజెక్టుల కట్టడం వంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే నాణ్యత లోపం కారణంగా కొన్నికట్టడాలు నిర్మాణ దశలోనే కూలిపోతుండటం విచారకరం. ఇటీవల బీహార్ లో ఓ వంతెన నిర్మిస్తుండగానే కుప్పకూలిన సంగతి విదితమే. ఇటీవల హైదరాబాద్ లో ఎల్బీనగర్ లో నిర్మితమౌతున్న ఫ్లై ఓవర్ కూడా కూలిపోయింది. ఈ సంఘటనలు మర్చిపోక ముందు ఇప్పుడు మరో నిర్మాణం నేలకొరిగింది. కార్మికులు పనుల్లో ఉండగా.. ఈ నిర్మాణం కూలడంతో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది.
నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మృత్యువాత పడిన ఘటన ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో చోటుచేసుకుంది. సైరంగ్ సమీపంలోని కురుంగ్ నదిపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 17 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కురంగ్ నదిపై బైరాబీ-సైరంగ్లను కలిపేలా ఈ వంతెన నిర్మిస్తున్నారు. ప్రమాద సమయానికి వంతెనపై 50 మందికిపైగా కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. 30 నుండి 40 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని.. సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జోరామ్ థంగా విచారం వ్యక్తం చేశారు. ‘ఐజ్వాల్ సమీపంలోని సైరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయింది. సుమారు 17 మంది కార్మికులు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress.
Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7
— Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023