నిత్యం ఏదో ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మద్యం తాగి వాహనాన్ని నడపడం, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వంటి వివిధ కారణలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రమైన గాయాలతో బతికి ఉన్న జీవిచ్ఛావాల్లా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా అభంశుభం తెలియని ఎందరో చిన్నపిల్లలు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తాజాగా మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞాన యాత్ర కాస్తా విషాద యాత్రగా మిగిలింది. యాత్రకు వెళ్లిన విద్యార్ధుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటన మణిపూర్ లోని నోనీ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మణిపూర్ రాష్ట్రం నోనీ జిల్లాకులోని థంబాల్ను పాఠశాలకు చెందిన విద్యార్థులు రెండు బస్సుల్లో విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో లాంగ్ సాయ్ అనే ప్రాంతం సమీపంలోకి రాగానే అమ్మాయిలు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారి రోడ్డుపై అడ్డగా బోల్తాపడింది. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులకు సమాచార అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. విద్యార్ధులు స్టడీ టూర్ కోసం ఖోపూమ్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ మరణాలపై అధికారిక సమాచారం లేదు.
ఈ ప్రమాదంలో పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఇంఫాల్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 20 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై మణిపూర్ సీఎం ఎన్ బీరేన్సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతేకాక ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. విద్యార్ధుల బస్సులు ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు. మరి.. నిత్యం ఇలా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Deeply saddened to hear about the accident of a bus carrying school children at the Old Cachar Road today. SDRF, Medical team and MLAs have rushed to the site to coordinate the rescue operation.
Praying for the safety of everyone in the bus.@PMOIndia pic.twitter.com/whbIsNCSxO
— N.Biren Singh (@NBirenSingh) December 21, 2022