కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీరవాణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా తన సోదరుడు కీరవాణికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అన్నయ్య విషయంలో గర్వంగా ఉన్నట్లు.. కీరవాణితో దిగిన ఫోటోను తన సోషల్ మీడీయాలో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జక్కన్న. నాకే గనక విశ్వంతో మాట్లాడే అవకాశం వస్తే.. అవార్డుకు అవార్డుకు మధ్య కాస్త గ్యాప్ ఇవ్వమని ఈ విశ్వానికి చెబుతా అంటూ జక్కన పేర్కొన్నాడు.
ఎం.ఎం. కీరవాణి.. తెలుగు చిత్ర సంగీత దర్శకుడిగా, ప్రతీ తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తన సంగీత సముద్రంలో కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను ఓలలాడిస్తూనే ఉన్నారు కీరవాణి. తాజాగా ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తన పెద్దన్నకు పద్మశ్రీ రావడంతో సంతోషంలో మునిగిపోయాడు దర్శకధీరుడు జక్కన్న. ఈ సందర్భంగా సోషల్ మీడియాతో కీరవాణితో ఉన్న అనుబంధం గురించి ఫోటో ద్వారా తెలియజెప్పాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాజమౌళి.
Like many of your fans feel, this recognition indeed was long over due.
But, as you say the universe has a strange way of rewarding one’s efforts.
If I can talk back to universe, I would say
Konchem gap ivvamma. okati poorthigaa enjoy chesaaka inkoti ivvu. 🥰 pic.twitter.com/JSNnivpRNq— rajamouli ss (@ssrajamouli) January 26, 2023
“నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని నేనూ మీ అభిమానుల లాగే అనుకుంటున్నాను. అయితే మీరే చెప్పారు ఒకసారి.. ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ విశ్వం ఊహించని రీతిలో ఇస్తుందని. ఇక నేనే గనక విశ్వంతో మాట్లాడితే.. అవార్డుకు, అవార్డుకు కొంచెం గ్యాప్ ఇవ్వమని చెబుతాను. ఎందుకంటే ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక, ఇంకోటీ ఇవ్వు అని” అంటూ రాసుకొచ్చారు రాజమౌళి. ఇక ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్నా నాటు నాటు సాంగ్ కు గనక ఆస్కార్ వస్తే.. కీరవాణి మణి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లు అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు తనకు పద్మశ్రీ రావడంపై స్పందించారు కీరవాణి. ఈ సందర్బంగా తన తల్లిదండ్రులకు, గురువులకు సదా రుణపడి ఉంటానని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. మరి కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.