తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా వెలుగొందుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. సినిమా పరిశ్రమలో మాటల రచయితగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి టాలీవుడ్ లో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇక అతని సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంటుంది.
ఇదిలా ఉంటే ఆయన భార్య సౌజన్యశ్రీనివాస్ నృత్య ప్రదర్శనలో ఆరితేరారు. ఎంతో ప్రతిభ గల ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శనను శుక్రవారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ కార్యక్రమం డిసెంబర్ 2న జరగాల్సి ఉంది. కానీ సౌజన్య శ్రీనివాస్ బాబాయ్ అయిన ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో ఈ వేడుక వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ కార్యక్రమం వైభవంగా రేపు జగరనుంది. కాగా ఈ శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు సంబంధించి ఫోటో సైతం విడుదల చేశారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.