రాజస్తాన్లో అర్చనా అనే వైద్యురాలు గర్భణీకి చికిత్స చేస్తుండగా.. సదరు మహిళ మృతి చెందింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సదరు డాక్టర్ అర్చనాపై మీద కేసు నమోదు చేశారు. మనస్తాపానికి గురైన వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. అయితే డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు స్పందిస్తున్నారు. డాక్టర్ అర్చనా మృతిపై తాజాగా హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఓ వైద్యురాలి తన జీవితాన్నే ముగించాల్సి రావడం చాలా బాధాకరం. ప్రతీసారి వైద్యులు దాడికి గురవుతున్నారు. ఇతర 100 మంది వైద్యులు రిస్క్ తీసుకోవడం ఆపేశారు. కానీ సాధారణంగా ఒకరి ప్రాణాలను కాపాడేందుకు రిస్క్ తీసుకోవాలి’ అని ‘ట్విట్టర్ హీరోయిన్ ప్రణీత పేర్కొంది. రాజస్తాన్, దౌసా జిల్లాకు చెందిన డాక్టర్ అర్చనా శర్మ.. ఆమె భర్తతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నడుపుతున్నారు. ఈ క్రమంలో బాధిత గర్భిణీ మహిళ వైద్యం నిమిత్తం సోమవారం అర్చన ఆస్పత్రికి వచ్చింది. సిజేరియన్ చేస్తుండగా దురదృష్టవశాత్తు గర్భిణీ మృతి చెందింది.
అర్చన నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. డాక్టర్పై చర్యలు తీసుకోవాలిందిగా డిమాండ్ చేస్తూ నిరసన తెలపడమే కాక.. అర్చనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన డాక్టర్ అర్చన.. మంగళవారం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ కలకలం రేపుతుంది. దీనిలో అర్చన తాను నిర్దోషిని అని.. అది నిరూపించడానికి తన చావే సాక్ష్యం అని.. ఇక మీదటనైనా అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని విజ్ఞప్తి చేసింది.. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sad that a doctor had to end her life to prove her innocence.. #JusticeForDrArchanaSharma #DrArchanaSharma pic.twitter.com/cTSRQNTsPC
— Pranitha Subhash (@pranitasubhash) March 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.