ఢిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ బాలుడిని కొందరు గుర్తు తెలియని దుండుగులు కిడ్నాప్ చేశారు. దీంతో తెలివిగా వ్యవహరించిన ఆ బాలుడు ఆ కిడ్నాపర్లకు దిమ్మతిరిగే షాకిచ్చి వారి చెంత నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటనలో బాలుడి తెలివి, ధైర్య సాహసాలను చూసి పోలీసులు మెచ్చుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బాలుడిని కిడ్నాప్ చేసిన ఈ దుండగులు ఎవరు? ఆ కిడ్నాపర్ల నుంచి ఆ బాలుడు ఎలా బయటపడ్డాడనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఢిల్లీ సరిహద్దుల్లో ఘజియాబాద్ లోని మురాద్ నగర్ ప్రాంతంలో ఆరవ్ రాఠీ అనే 11 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు.
అయితే ఇటీవల శనివారం ఆరవ్ సైకిల్ మీద కూరగాయల కోసం సంతకు వెళ్లి తిరిగి ఇంటికొస్తున్నాడు. ఆ బాలుడి రాకను గమనించిన కొందరు దుండగులు అతడిని వెంబడించారు. ఇక కొద్దిదూరం వెళ్లాక ఆ దుండగులు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా వ్యానులో ఎక్కించారు. ఆ వ్యాను కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆ దండుగులు ఆ బాలుడి ఒంటిపై ఉన్న బట్టలు మొత్తం విప్పారు. అనంతరం ఆ బాలుడి బట్టలతో పాటు అతడి సైకిల్ ను రోడ్డు పక్కకు పడేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ బాలుడు కాస్త తెలివిగా వ్యవహరించాడు. దుండగుడి చేతిని తన నోటి పళ్లతో గట్టిగా కోరికాడు. దీంతో ఆ దుండగుడి చెయ్యి నొప్పిగా ఉండడంతో ఆ బాలుడిని వదిలేశాడు. దీంతో వెంటనే ఆ బాలుడు ఆ వ్యాను నుంచి కిందకు దూకి అక్కడి నుంచి పరారరయ్యాడు.
ఇక పరుగు పరుగున ఎట్టకేలకు ఆ బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు. అనంతరం జరిగిన విషయంపై తన తల్లిదండ్రులకు వివరించాడు. వెంటనే స్పందించిన ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడిని విచారించడంతో.. వారి చేతిలో కత్తులు, గాజు సీసాలు ఉన్నాయని, నేను అరిస్తే నిన్ను, మీ అమ్మ గొంతు కోస్తామని బెదిరించారు. ఇదే కాకుండా నన్ను కిడ్నాప్ చేశాక.. మా నాన్న నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని కూడా వారు చర్చించుకున్నారని బాలుడు పోలీసులకు వివరించాడు. దీంతో ఆ చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న ఆ బాలుడి తెగువను చూసి పోలీసులు మెచ్చుకున్నారు. అనంతరం ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనలో బాలుడి ధైర్య, సాహసాలను చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు.