మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి సమయంలో న్యూసెన్స్ క్రియేట్ చేశాడని కాలనీవాసులంతా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం అర్థరాత్రి సమయంలో అపార్ట్మెంట్ నుంచి కేకలు, అల్లరు వినిపించటంతో హఠాత్తుగా అందరూ బయటకు వచ్చారు. దీంతో ఏం జరిగిందని అందరూ చైతన్యను అడిగేసరికి వాళ్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో కాలనీవాసులకు, చైతన్యకు మధ్య వివాదం కాస్త తీవ్రంగా మారింది.
ఈ నేపథ్యంలోనే వారు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే చైతన్య కూడా కాలనీవాసులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక ఈ మధ్య కాలంలో మెగా హీరో నాగబాబు కూతురు నిహారికకు వ్యాపారవేత్త అయిన జొన్నలగడ్డ చైతన్యకు ఇచ్చి వివాహం జరిపిన విషయం తెలిసిందే.