ఇటీవల ప్రైవేల్ కాలేజీల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ నార్సింగ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్థులకు చక్కటీ విద్యనంధించడానికి ఎన్నో స్కీమ్స్ అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే అమ్మఒడి కింద తల్లులకు ప్రతియేట రూ.15 వేల ఖాతాల్లో జమ చేస్తున్న విసయం తెలిసిందే. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలని మార్పులు.. చేర్పులు చేపట్టారు.