సమాజానికి ఓ మంచి సమాచారాన్ని అందించాల్సిన కొందరు ఉపాధ్యాయులు చేడు దారులను వెళుతూ కేటుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారు. భవిష్యత్ తరాలను తీర్చుదిద్దాల్సింది పోయి శారీరక సుఖాల కోసం కొంత మంది నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది. బన్స్వారాలోని ప్రాంతంలో ఓ మహిళ టీచర్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ల వరకు భర్తతో హాయిగా గడిపింది.
కానీ అనుకోని కారణాల వాళ్ళ ఆమె భర్తను కోల్పోవల్సి వచ్చింది. దీంతో కొన్నాళ్లు భర్త లేకుండా ఆ టీచర్ ఒంటరి జీవితాన్ని గడిపేస్తుంది. ఇక కొన్ని రోజులకు ఆమెకు బన్స్వారా ఘాటోల్లో మొబైల్ షాప్ నడిపేవాడు ముస్తఫా షేక్ అనే యువకుడి నుంచి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వస్ట్ వెళ్ళింది. ఇక నాలుగు రోజుల తర్వాత ఆ మహిళ.. ఆ రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేసింది. దీంతో కొన్ని రోజుల్లో ముస్తఫా షేక్ ఆ మహిళను మెల్ల మెల్లగా తన ట్రాప్ లోకి లాగాడు. ఎలాగైనా ఆ టీచర్ ని లోబరుచుకోవాలని భావించిన ఆ యువకుడు కొత్త స్కెచ్ లతో ముందుకు అడుగులు వేశాడు.
కొన్ని రోజుల వరకు ఇద్దరు బాగానే ఉన్నారు. దీంతో మనోడి అసలు రూపాన్ని ఆ మహిళా టీచర్ పై ప్రయోగానికి సిద్దమయ్యాడు. ఒక రోజు ఆ యువకుడు ఆ మహిళ టీచర్ కి ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అంటూ దీనంగా నమ్మబలికాడు. నిజమే అని భావించి ఆ మహిళ అయ్యో.. ఎందుకు అని కొన్ని భరోసా నింపే మాటలు రెండు చెప్పింది. దీంతో మనోడు కాస్త వెనక్కి తగ్గినట్టు యాక్టింగ్ చేస్తూ..ఆర్థిక ఇబ్బందుల కారణంతో బతకలేక పోతున్నానని చెప్పటంతో ఆ మహిళ టీచర్ గుండె కరిగిపోయింది.
కాగా ఆ మహిళ నుంచి అలా ఐదేళ్లలో రూ.10 లక్షల వరకు లాగేశాడు. ఇక ముస్తఫా షేక్ ఒకరోజు మనం కలవాలని చెప్పి ఓ రూంలోకి తీసుకెళ్లాడు. దీంతో ఇద్దరు కలిసి ఉండగా ఆ తర్వాత కూల్డ్రింకులో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాడు. తెలియక తాగేసింది. ఇక అనంతరం ఆ యువతిని వివస్త్రను చేసి రేప్ చేశాడు. ఇంతటితో ఆగకుండా వీడియోలు కూడా తీశాడు. ఇక ఆ టీచర్ నిద్ర నుంచి మెలుకున్నాక అంత గ్రహించే సరికి వీడియోలు చూపించాడు. దీంతో అలా రోజు రేప్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. తట్టుకోలేని ఆ మహిళ ఏం చేయాలో తెలియక ఓ రోజు పోలీసులను ఆశ్రయించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.