సాధారణంగా పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. పాపులర్ టీవీ ఛానల్స్ అన్నీ బుల్లితెరపై సరికొత్త వినోద కార్యక్రమాలు ప్లాన్ చేస్తుంటాయి. ఇప్పుడు రాబోతున్న దసరా పండుగ కోసం ప్రముఖ ఛానల్స్ సినీ, బుల్లితెర సెలబ్రిటీలతో ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశాయి. ఎప్పటిలాగే ఈటీవీ వారు దసరా వైభవం’ అనే ప్రోగ్రామ్ తో ముందుకు రాబోతున్నారు. అయితే.. ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. చూస్తుంటే ఈ దసరా ఈవెంట్ కోసం నటి, ఏపీ మంత్రి రోజా ముఖ్యఅతిథిగా విచ్చేసినట్లు తెలుస్తుంది.
ఇక స్టేజిపై రోజా ఎంటర్ అవ్వగానే అందరు ఉత్సాహంగా ఆహ్వానం పలికారు. ఆ ఆనందంలోనే రోజా కూడా హైపర్ ఆది లాంటి కమెడియన్స్ పై కొన్ని పంచులు వేశారు. అలా మొత్తానికి ప్రోమో అంతా సరదాగానే సాగింది. సినీ నటుడు కృష్ణ భగవాన్ కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది ఇద్దరూ కూడా కూరగాయల వ్యాపారం చేస్తున్న స్కిట్ తో అందరిని నవ్వించారు. ఆ తర్వాత గెటప్ శ్రీను దశావతారం కాన్సెప్ట్ తో ఒక్కో గెటప్ లో అందరిని అలరించాడు.
ఈ క్రమంలో ప్రోమో చివరి దశకు వచ్చేసరికి రోజా ఒక్కసారిగా అందరిపై సీరియస్ అయిపోయింది. “నన్ను అవమానించడానికే షోకి రమ్మన్నారా? ప్లాన్ చేసుకొని పిలిచారా” అంటూ వెంటనే ఎమోషనల్ అయిపోయి స్టేజిపై నుండి వెళ్లిపోవడం మనం ప్రోమోలో చూడవచ్చు. మరి ప్రస్తుతం రోజా సీరియస్ అవుతూ భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక దసరా పండుగ రోజు ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.