యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ తో ఫ్యాన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఒకేసారి రాధేశ్యామ్ కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి.
ఇప్పటికే రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటిదాకా రాధేశ్యామ్ నుండి విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా విడుదలైన సంచారి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది.
డిసెంబర్ 23న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ లను అభిమానులే రిలీజ్ చేయనుండటం విశేషం. పూర్తిగా కోవిడ్ నిబంధనలకు కట్టుబడి అభిమానులు, అతిథులు రావాలని చిత్రయూనిట్ తెలిపింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ తో రిలీజ్ చేయించడం గొప్ప విషయమని చెప్పాలి.
కెకె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రాన్ని.. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రసీధ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ తదితరులు ఈ సినిమాలో కీలకపత్రాలు పోషించారు. మరి ట్రైలర్ ఫ్యాన్స్ చేత లాంచ్ చేయించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Witness the first-ever trailer launch event by the fans in Indian cinema. 23rd December, Ramoji Film City, Hyderabad.#RadheShyam #RadheShyamPreReleaseEvent
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/yavf4YXuJw
— Radhe Shyam (@RadheShyamFilm) December 18, 2021