ప్రముఖ మరాఠీ నటి, ‘సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా’ ఫేమ్ మీనాక్షి రాథోడ్.. ప్రస్తుతం తన జీవితంలో ప్రత్యేక దశను ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రకటించింది. అలాగే మీనాక్షి తన బేబీ షవర్ (దోహలే జెవాన్) సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది.
ఈ స్పెషల్ ఈవెంట్ లో మీనాక్షి తన బేబీ బంప్ను ఎంజాయ్ చేస్తూ, తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. మీనాక్షి, ఆమె భర్త కైలాష్ వాఘ్మారే సంప్రదాయ పద్దతిలో బేబీ షవర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక మీనాక్షి మరాఠీ సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితమే. బేబీ బంప్ ఆడించే సమయంలో ఆమె గ్రీన్ లెహంగా ధరించడం మనం ఫోటోలలో చూడవచ్చు.
ఇక ఈ మీనాక్షి రాథోడ్ తన పెళ్లికి ‘సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా’ సీరియల్ టీమ్ అందరినీ ఆహ్వానించింది. కానీ మీనాక్షి పెళ్ళికి ఆమెతో కలిసి నటిస్తున్న సందీప్ పాటిల్ రాకపోయేసరికి పలు అనుమానాలకు దారి తీస్తున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. అవన్నీ ఉహాగానాలని మీనాక్షి తేల్చేసింది. ఇక మీనాక్షి ‘సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా’ షోలో దేవకీ పాత్రను పోషిస్తోంది. మరి మీనాక్షి బేబీ బంప్ మూమెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.