మలయాళం సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. గతంలో మోహన్ లాల్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్ కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్లాల్ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్ను గత సెప్టెంబర్లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్ లాల్ ఇందుకోసం వెళ్ళాడు అనే విషయంపై కారణాలు తెలియాల్సి ఉంది. సినీ వర్గాల సమాచారం మేరకు.. ‘కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధమని కేరళ పోలీసులు తెలిపారు.
కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. బ్రో డాడీ, ఆరాట్టు సినిమాలతో హిట్స్ ఖాతాలో వేసుకున్న మోహన్ లాల్ చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. వాటిలో 12థ్ మ్యాన్, అలోన్, మాన్స్టర్ సినిమాలు చివరి దశలో ఉండగా.. బారోజ్, రామ్, ఎల్2 ఎంపురాన్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి మోహన్ లాల్ కు ఈడీ సమన్లు పంపించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.