దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై ఓ వ్యక్తి ముఖంపై మైనర్ బాలుడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. విషయం ఏంటంటే? ఢిల్లీలో జహంగిర్ పురిలో జావెద్ అనే 36 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే జావెద్ ఇటీవల ఓ వ్యక్తిని కొట్టాడట. ఈ విషయం తెలుసుకున్న అతని మైనర్ కుమారుడు కొట్టిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
ఇది కూడా చదవండి: West Bengal: మహిళ చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు గంటల పాటు నరకం!
ఇందులో భాగంగానే ఆ మైనర్ బాలుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి జావెద్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. జావెద్ ఓ దుకాణం ముందు ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. వెంటనే అతనిని గమనించిన ఆ మైనర్ బాలుడు తన చేతిలో ఉన్న గన్ తో అతని ముఖంపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఇక వెంటనే గమనించిన స్థానికులు జావెద్ ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు మైనర్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా కూడా పోలీసులు తెలిపారు. తాజాగా ఢిల్లీతో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Delhi: 4 minor boys apprehended for firing at a man in Jahangirpuri on 15th July. The man has been hospitalised. Case u/s 307 IPC registered. Accused say that the man had beaten up father of one of the minors 7 months back & they had come to take revenge.
(Source: CCTV) pic.twitter.com/Icl2i4x3LN
— ANI (@ANI) July 16, 2022