ప్రసుత్త కాలంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని.. నిలుపుకోవడం, రెట్టింపు అయ్యే మార్గాలు చూడటం అంతకన్నా ఎక్కువ ముఖ్యం అయ్యింది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల పథకాలున్నాయి. అయితే ఇలాంటి పథకాల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆ తర్వాత భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పొదుపు పథకాలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ క్రమంలో ఎలాంటి రిస్క్ లేకుండా.. నమ్మకంగా ఆదాయం ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ స్కీమ్లు ముందు వరసులో ఉంటాయి. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. ఐదేళ్లలో మీ సొమ్ము రెట్టింపు అవుతుంది. ఆ వివరాలు..
క్రమం తప్పక చక్కటి ఆదాయాన్ని ఇచ్చే పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి స్కీములోల పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. అలా ఎక్కువ ప్రజాదరణ పొందిన పథకమే ‘పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్’(పీఓఎమ్ఐఎస్). ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చి చాలా కాలమే అవుతుంది. దీనిలో పెట్టబడి పెట్టిన ఖాతాదారులకు నెలవారీ వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుండటంతో అన్ని వయసు సమూహాలనూ ఈ స్కీమ్ ఆకర్షిస్తోంది. ప్రభుత్వ స్కీమ్ కావడంతో పెట్టుబడి భద్రత విషయంలో కూడా ఎలాంటి భయం లేదు. అంతేకాక ఎక్కువ కాలం ఎదరు చూడకుండా.. కేవలం ఐదేళ్ల తర్వాత స్కీమ్ మెచ్యూరిటీ పూర్తవుతుంది. ఆ తర్వాత పెట్టుబడి మొత్తాన్ని చందాదారుడికి తిరిగి చెల్లిస్తారు.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా వినియోగదారుడు.. ప్రతినెలా తన ఖాతాలో జమయ్యే వడ్డీని.. డబ్బు వృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు. అదెలా సాధ్యపడుతుందంటే.. సదరు వినియోగదారుడు.. పోస్టాఫీసులో ఆర్డీఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రికరింగ్ డిపాజిట్ ఖాతాలో జమ చేస్తుండాలి. ఈ మధ్యకాలంలో పోస్టాఫీసులు రికరింగ్ ఖాతాలపై మంచి రిటర్నులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడాది రికరింగ్ డిపాజిట్పై త్రైమాసికానికి 5.8 శాతం చక్రవడ్డీ లభిస్తుంది. దీంతో రూ.4.5 లక్షల పెట్టుబడితో ఇటు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఆదాయంతోపాటు రికరింగ్ డిపాజిట్పై కూడా ఆదాయాన్ని పొందొచ్చు. ఈ విధానంలో ఖాతాదారుడి పెట్టుబడి దాదాపు రెట్టింపు అవుతుంది.
ముందుగా ఈ పథకంలో మూలపెట్టుబడి రూ.4,50,000 ఇన్వెస్ట్ చేయాలి. దీనిపై 6.6 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.2,475 ఖాతాలో జమవుతుంది. ఇదే వడ్డీ రేటుతో జాయింట్ అకౌంట్ మూలధనం రూ.9 లక్షలు అయితే ప్రతి నెలా రూ.4,922 ఆదాయం వస్తుంది. సింగిల్ అకౌంట్తో ప్రారంభించాలనుకునే వ్యక్తులకు రూ.4,50,000 ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే రూ.9 లక్షల పెట్టుబడి ఉండాలి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతి నెల నుంచి మెచ్యూరిటీ తీరే వరకు ప్రతి నెలా వడ్డీ ఖాతాలో జమవుతుంది. ఖాతాలో జమయిన వడ్డీని తీసుకోకుంటే దానిపై అదనంగా ఎలాంటి వడ్డీ వర్తించదు. మైనర్ల పేరిట వారి సంరక్షకులు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. స్కీమ్ ఐదేళ్ల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మెచ్యూరిటీ పూర్తవ్వకముందే చనిపోతే నామినీకి డబ్బులు అందజేసి.. ఖాతాను రద్దు చేస్తారు.