దేశంలోని రేస్ కోర్సులు, ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై జీఎస్టీ రేట్ల నిర్ధారణకు కేంద్ర ఆర్థిక శాఖ, జీఎస్టీ కౌన్సిల్.. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా సహా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఆ కమిటీ.. వీటిపై 28 శాతం జీఎస్టీ వేయాలని తుది నివేదికను రూపొందించింది. త్వరలో జరగబోయే జీఎస్ఆ మండలి సమావేశంలో ఈ నివేదిక చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను రూపొందించింది. రేస్ కోర్సులు, ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్జీ విధించాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నివేదికను ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెంతకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో జరిగే జీఎస్జీటీ మండలి సమావేశంలో ఈ నివేదిక పై చర్చించనున్నారు. ప్రస్తుతం క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్స్ పై 18 శాతం జీఎన్జీటీ వసూలు చేస్తున్నారు. ఈ సేవల విలువను అంచనా వేయడంతో పాటు వాటి నిర్దిష్ట లావాదేవీలపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించేందుకు గతేడాది జూన్ లో ఈ కమిటీ ఏర్పాటైంది. అలాగే కాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్ లకు సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాల్లో పలు మార్పులు చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.
The Group of Ministers (GoM) on casinos, race courses & online gaming has come to a consensus.
The report of our submissions will be handed over to Hon’ble FM, Smti. @nsitharaman Ji in a day or two & the matter will be presented in the next @GST_Council Meeting @FinMinIndia pic.twitter.com/n3Zm0yHSbl
— Conrad Sangma (@SangmaConrad) May 18, 2022
The Group of Ministers tasked to review GST levy on online gaming, casinos and horse races has proposed to increase the GST to 28% from current 18%. #1ShotNews | #OnlineGaming | #Rummy | #GST | #Tax | #HorseRace | #Casino pic.twitter.com/2nLymfa5uB
— EverythingWorksHere (@HereWorks) May 18, 2022
ఇది కూడా చదవండి: RBI Rules: నగదు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. లిమిట్ దాటి ట్రాన్సక్షన్స్ చేశారో బుక్కైనట్లే..!