ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకుల ప్రాణాలు బుగ్గిపాలవుతున్నాయి. అలానే మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరక ప్రాయంగా గడపుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలోని ఓ టైల్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి.