స్వదేశంలో జరుగుతున్న టెస్టు మ్యాచులో పసికూన ఐర్లాండ్ పై శ్రీలంక తన ప్రతాపం చూపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేయడం విశేషం. వీటిలో 200 పరుగుల భాగస్వామ్యాలు రెండు రాగా.. ఒక 100 పరుగుల భాగస్వామ్యం వచ్చింది.