'స్వలింగ సంపర్కుల వివాహాలు..' ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు వివాహబంధంతో ఒక్కటవ్వడం. ప్రాచీన కాలంలో ఇలాంటివి ఎన్నడూ వినపకపోయినా, ఆధునిక కాలంలో వీటి ఉనికి బాగానే ఉంది. మొదట పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ సంస్కృతి మెల్లమెల్లగా భారతదేశంలోనూ తిష్టవేసింది. ఎందరో అబ్బాయిలు, అమ్మాయిలు దాంపత్య జీవితంతో ఒక్కటయ్యారు. పిల్లలను కన్నారు. వీరి నిర్ణయాన్ని సమాజం సైతం అంగీకరించింది. అయితే, తమ వివాహాలను చట్టబద్దంగా గుర్తించాలంటూ వారు సుప్రీం కోర్టుకు వెళ్లడం.. కేంద్రం తన వైఖరి తెలియజేయడం వివాదానికి దారి తీసేలా ఉంది.