ఆస్తులు, డబ్బులకు మనుషుల మధ్య ఉండే సంబంధాలను పెంచగలవు, తుంచగలవు. అలానే ఆస్తుల కోసం సొంత బంధువులే మోసం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆస్తులు తమ పేరున రాయించుకునే వరకు ప్రేమగా చూసుకుని, ఆ తరువాత బయటకి గెంటేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.