గన్నవరం ఎపిసోడ్లో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఎట్టకేలకు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనపై పోలీసు స్టేషన్లో దాడి జరిగిందని తెలిపారు.