పాన్ ఇండియా స్టార్స్ అనగానే దాదాపు సౌత్ హీరోల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓ రకంగా పాన్ ఇండియా అనే బ్రాండ్ ని వెలుగులోకి తెచ్చింది మన తెలుగు హీరోలే. బాహుబలితో ప్రభాస్, అల్లు అర్జున్(పుష్ప), రామ్ చరణ్ - ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్) పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. కన్నడ నుండి యష్, రిషబ్ శెట్టి సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఇప్పటిదాకా మలయాళం నుండి ఏ ఒక్క హీరో ఎస్టాబ్లిష్ కాకపోవడం గమనార్హం.