దేశంలో ఎంత అభివృద్ది చెందినా.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలు సరైన రవాణా వసతులు లేక కష్టాలు పడుతూనే ఉన్నారు. ఓట్ల ముందు నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. తీరా గెల్చిన తర్వాత అటు ముఖం చూడరని బాధితులు తమ బాధ వ్యక్తపరుస్తున్నారు.
మీడియా అంటే నిజాన్నిచెప్పేది మాత్రమే కాదు. అభాగ్యులకు అండగా నిలబడేది కూడా. ఒకరి కష్టాన్ని చూసి, మనసు చలించి పోయి వారి బాధ తీరే వరకు తోడుగా నిలవడం కూడా మీడియా బాధ్యత. ఈ విషయంలో సుమన్ టీవీ ఎప్పుడూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే వస్తోంది. కష్టం ఎక్కడ ఉంటే అక్కడ సుమన్ టీవీ రిపోర్టర్స్ వాలిపోతూ.., వారి పరిస్థితిని సమాజానికి తెలియ చేస్తున్నారు. ఈ విషయంలో సుమన్ టీవీ యాంకర్ నిరుపమ ప్రజల మనసుని గెలుచుకున్నారు. […]