ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో ప్రాణాంతక వైరస్. మార్బర్గ్ వైరస్ గా పిలవబడుతున్న ఈ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్ర జ్వరం బారిన పడి రక్తనాళాలు చిట్లి మరణించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. అందులోనూ.. ఈ వైరస్ సోకిన 8 నుంచి 9 రోజుల్లోనే మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.