అమెరికాలో లక్షల్లో జీతం కాదని గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి సొంతింటి కలను నిజం చేయడం కోసం స్టార్టప్ కంపెనీని ప్రారంభించి తక్కువ ధరకే ఇండ్లను నిర్మిస్తున్నారు ఓ మహిళ. అది కూడా వ్యవసాయ వ్యర్థాలతో ఎకో ఫ్రెండ్లీ హౌస్ లను నిర్మిస్తున్నారు.
వినాయక చవితి నేపథ్యంలో ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి చెందిన కాంత యాదవ్ ఆవుపేడతో పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు తయారు చేశారు. హిందూ సంస్కృతితో ఆవుపేడను పవిత్రంగా భావిస్తుంటారు. అందుకే ఎండిన ఆవుపేడతో కలప దుమ్ము, మైదా పొడి కలిపి మిశ్రమాన్ని వినాయకుడి అచ్చులో పోసి విగ్రహాన్ని తయారు చేశామని 15 నిమిషాల్లోనే తయారు చేసిన ఈ విగ్రహాలు ఆరబెట్టడానికి నాలుగైదు రోజులు పడుతోంది. […]