చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో మరణించిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపిన వారు ఇకలేరనే విషయాన్ని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఇలానే హృదయాలను ద్రవింప చేసే దృశ్యాలు ఈ ఘటనలో కనిపించాయి.