త్వరలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఉధ్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీల కార్లు, కాన్వాయ్లు రోడ్ల మీదకు వస్తే.. పోలీసులు తనిఖీలు చేయకుండా పంపిచేస్తారు. అవసరమైతే ట్రాఫిక్ కూడా ఆపుతారు. కానీ ఓ చోట మాత్రం అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా సీఎం కారునే తనిఖీ చేశారు. ఆ వివరాలు..
ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ రాజకీయాల్లో హీట్ రాజేసింది. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో.. ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీనితో పాటు మరో ఆసక్తికర చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
సుమారు 21 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా.. పార్టీ స్థాపించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు. సుమారు 13 ఏళ్ల పాటు నిరంతరంగా శ్రమించి.. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాడు. 60 ఏళ్ల తెలంగాణ వాసుల కల సాకారం కావడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత.. రెండు సార్లు.. పోటీ చేసి.. విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా గెలిచారు. తెలంగాణను అభివృద్ధి పథంలో […]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలుండగా.. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక గురువారం నాడు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే.. బీజీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక చివరకు మరోసారి గుజరాత్లో కమలం వికసించింది. ఇప్పటికే బీజీపీ 152 స్థానాల్లో […]
ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే ఎమోషన్స్ కి గురై విచక్షణ కోల్పోయి ఎన్నో అనార్థాలకు తెగబడుతున్నారు. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడి చేయడమే కాదు.. చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గుజరాత్లోని పోర్బందర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. ఓ జవాన్ తన సహ జవాన్లను కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. గుజరాత్ లో డిసెంబర్ 1,5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో […]
తెలుగు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది ప్రత్యేక ప్రస్థానం. ఉమ్మడి రాష్ట్రానికి.. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఐదేళ్లపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అరాచకాలు చూసి ప్రజలకు ఆ పార్టీ మీద నమ్మకం పూర్తిగా పోయింది. దాంతో.. ప్రజలు ఆ పార్టీకి ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. వెంటనే పొత్తుల అంశం తెర మీదకు వస్తుంది. అధికార పార్టీ విషయం పక్కకు పెడితే.. తెలుగు దేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే గత ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే.. జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుంది. ఇక ఎన్నికల వేళకు టీడీపీ కూడా పొత్తులో భాగస్వామ్యం అవుతుందంటూ నిన్నటి వరకు […]
లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంబీబీఎస్ పట్టా పొంది, ఆ తర్వాత భారత పరిపాలనా సేవ(ఐఏఎస్) చేసి.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. లోక్సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వతా దాన్ని రాజకీయ పార్టీగా మార్చి.. 2009తో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టీవ్గా లేరు. ఈ క్రమంలో జయప్రకాష్ నారాయణకు సంబంధించి ఓ ఆసక్తికర […]
ఓ వైపు ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తాజాగా మరో వినూత్న ఎన్నికల హామీ తెర మీదకు వచ్చింది. తమను గెలిపిస్తే.. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరికొద్ది రోజుల్లో గుజరాత్లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ మహిళలకు ఈ కొత్త హామీనిచ్చారు. గుజరాత్లో తమకు ఓట్లేసి.. ఆప్ అభ్యర్థిని ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెడితే.. […]