ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హిండెన్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో లక్షల కోట్ల సంపదను నష్టపోయినా, ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. వేల కోట్ల రుణాలను గడువుకు ముందే చెల్లిస్తూ.. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపుతున్నారు. తాజగా, రూ. 21వేల కోట్లకుపైగా అప్పులను రెండు వారాల ముందే చెల్లించి వార్తల్లో నిలిచారు.