ఇటీవల వై కేటగిరి వరకు సెక్యూరిటీ భద్రత ఉన్న వ్యక్తులు తప్ప ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు విధిస్తూ, అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగిస్తున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు.
ఇది కూడా చదవండి: నాగచైతన్య-కృతిశెట్టి రేర్ వీడియో వైరల్!
అయితే మన దగ్గర చాలా మంది సెలబ్రిటీలు తమ కార్లకి ఈ బ్లాక్ ఫిల్మ్ లు వాడతారు. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే సోదాల్లో చాలా మంది సెలబ్రిటీలు, స్టార్ల కార్లను ఆపి.. బ్లాక్ ఫిల్మ్ తొలగించి.. జరిమానా కూడా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, త్రివిక్రమ్.. లాంటి పలువురు ప్రముఖుల కార్లను ఆపి వారి కార్లకి ఉన్న బ్లాక్ ఫిల్మ్ లని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు.
ఇది కూడా చదవండి: తమ్ముళ్లు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను: మంచు లక్ష్మి
తాజాగా హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ జాబితాలో చేరారు. ఆయన కారుకు బ్లాక్ ఫిల్మ్లు ఉండటంతో పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీ హిల్స్ లో వెళ్తున్న చైతూ కారుకి బ్లాక్ ఫిల్మ్లను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ కారుని ఆపి.. ఆయనకు 700 రూపాయలు జరిమానా విధించారు. కార్ కి ఉన్న బ్లాక్ ఫిల్మ్ లని కూడా తొలగించారు. ఆ సమయంలో నాగ చైతన్య కార్ లోనే ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 152 స్క్రీన్ లలో ఆచార్య ట్రైలర్ రిలీజ్.. లిస్ట్ ఇదే!