వివాహిత శ్వేత మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు గురించి సీపీ త్రివిక్రమ్ వర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బుధవారం విశాఖ బీచ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన గర్భిణీ శ్వేత కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్తింటి వేధింపులు భరించలేక తన కూతురు చనిపోయి ఉంటుందని.. శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.