రాజుల కాలంలో గూఢచర్యం కోసం పావురాలను ఉపయోగించేవారని పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. శాంతి ధూతలుగా పిలిచే పావురాలను వందల కిలోమీటర్ల దూరంలోని కొత్త ప్రదేశాల్లో వదిలినా అవి తిరిగి తమ గమ్యస్థానానికి చేరుకోగలవట. అందువల్ల.. శత్రు దేశపు రహస్యాలను తెలుసుకునేందుకు వీటిని ఉపయోగించేవారని చరిత్ర పుటల్లో ఉంది.