విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ మిస్టర్ కింగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పాటలు, ట్రైలర్ యువతను ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ కాస్త తగ్గాయనే చెప్పాలి. అలాంటి సమయంలో శరణ్ కుమార్ మిస్టర్ కింగ్ పేరిట ఓ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.