ప్రజా రవాణా వ్యవస్థలో చాలా మార్పులొచ్చాయి. ప్రయాణికులు ప్రభుత్వ రవాణా వాహనాలనే కాకుండా ప్రైవేట్ వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నగరాల్లో అయితే ఉద్యోగాలకు వెళ్లే వారు, అర్జెంటుగా ప్రయాణం చేయాల్సిన వారు ఎక్కువగా ప్రైవేట్ సంస్థల వాహనాల ద్వారానే ప్రయాణాలు చేస్తున్నారు.