సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించి రిపబ్లిక్ సినిమాపై కొల్లేరులోని కొంతమంది జాయింట్ కలెక్టర్, ఎప్పీకి ఫిర్యాదు చేశారు. విషపూరిత రసాయనాలతో చేపలు సాగు చేస్తున్నట్లు సినిమాలో చూపించినట్లు వాళ్లు ఆరోపించారు. దీని వల్ల చేపల సాగుపై ఆధారపడి బతుకుతున్న తాము ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెప్పారు. తమ ప్రాంతం గురించి చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని, అప్పటి వరకూ సినిమాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై చిత్రబృందం స్పందించలేదు. ఈ మధ్య […]