ఫిబ్రవరి 14, 2019 పుల్వామా దాడి. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగింది. ఈ ఘటనతో పాక్, భారత్ ల మధ్య చిన్న యుద్ధమే జరిగింది. అనంతరం సద్దుమణిగింది. అయితే ఆ అమరుల భార్యలకు మాత్రం అన్యాయం జరిగింది.
దేశం ఉలిక్కిపడేలా చేసిన పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి 4 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ ఘటనలో అమరులైన 40 మంది జవాన్ల కోసం దేశం మొత్తం కంటతడి పెట్టింది. అయితే.. కొంతమంది మాత్రం అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచింది. అలా అండగా నిలిచిన వారిలో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా ఉన్నారు.