సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత మానవ జీవితంలో ప్రతి పని సులువైపోయింది. ఈ రోజు మనకు ఏ సమాచారం కావాలన్నా కూడా అంతర్జాలంలో క్షణాల్లో వెతుక్కునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్య వార్తల్లో సంచలనంగా మారిన అనువర్తనం చాట్ జిపిటి. మరి దీనిని నమ్మి ఓ ప్రొఫెసర్ విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన ఘటన ఒకటి చోటుచేసుకుంది.