ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ పేరే చెప్పేవారు. సౌత్ సినిమాలని బాలీవుడ్ కి పరిచయం చేయాలంటే ఏ దర్శకుడు కూడా ధైర్యం చేసేవాడు కాదు. కానీ బాహుబలి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే అనూహ్యంగా గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మూగబోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు "నసీరుద్దీన్ షా" సౌత్ సినిమాల మీద పగ పట్టినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసాడు.