ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈ నెల 7న ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఒక్కొక్కటిగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు ఈ జంట. వాటిలో ఓ ఫోటోలో ధరించిన లెహంగాపై చర్చ నడుస్తోంది.