ఆంధ్రప్రదేశ్ లో మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ […]