గుండెపోటు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది. ఎందుకంటే గతంలో అంటే 60 ఏళ్లు దాటిన వారికి, అదీ ఊబకాయం ఉన్న వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండెపోటు వస్తోంది.
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనావ్యాప్తి, కట్టడి చర్యలపై చర్చించిన మంత్రివర్గం.. ఒమిక్రాన్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. పీఆర్సీ విషయంలో గతంలో విడుదల చేసిన జీవోలను ఆమోదించింది. కరోనా సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబంలోని సభ్యులకు కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గం సమావేశం తర్వాత తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వివరించారు. పీఆర్సీ […]