ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పక్ష నేతలు.. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి చెబుతుంటే.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.