దేశంలో రాజకీయాలు కుల, మతాలతో ముడిపడి ఉన్నాయి. కొంత మంది రాజకీయ లబ్ది కోసం భగవంతుడ్ని ఇందులోకి లాగేస్తుంటారు. దేవుళ్ల పేరు చెబుతూ ఓటర్లకు గాలం వేస్తుంటారు. ఇవన్నీ గతం నుండి జరుగుతూ ఉన్నవే. అయితే దేశంలో హిందువుల మెజార్టీ ఉన్న నేపథ్యంలో రాజకీయాలన్నీ హిందూ దేవుళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అయోధ్య రాముని వివాదం ఎన్ని ఏళ్లు కోర్టులో నలిగిన సంగతి విదితమే. అయితే రాముడి పేరుతో అధికార పార్టీ రాజకీయం చేస్తుండటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్తుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.