ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో 2,300 కి.మీ పూర్తిచేసుకున్నారు.
ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి వ్యూహరచనలు పన్నుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. ప్రతిపక్ష నేతలు అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని.. ఏపిని అప్పుల పాలు చేశారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళితే.. అధికార పక్షం మాత్రం తాము చేసిన అభివృద్ది పనులు, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.