హైదరాబాద్ నగరంలోని తీగల వంతెనపై నుండి ఓ వ్యక్తి నీళ్లల్లోకి దూకేయడం కలకలం రేపింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, గతంలో ఓ మహిళ కూడా ఈ వంతెనపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే.