ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబందించి పుట్టుకొచ్చిన ఉద్యమం మీటూ. దీన్ని వేదికగా చేసుకుని అనేక మంది మహిళలు తమ గళాన్ని విప్పుతున్నారు. అనేక సందర్భాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ప్రముఖులు సైతం తమ వేదనను వెలిబుచ్చుతున్నారు. నటి, బీజెపీ నేత ఖుష్బు, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ వంటి వారు చిన్న వయస్సులో ఎదుర్కొన్న వేధింపులను చెప్పారు. ఇప్పుడు ఆ జాబితాలో ఓ అధికారిణి చేరింది.